టీమిండియాకు బిగ్ షాక్ .. కేఎల్ రాహుల్ ఔట్

టీమిండియాకు  బిగ్ షాక్ ..   కేఎల్ రాహుల్ ఔట్

టీమిండియాకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.  గాయం కారణంగా స్వదేశంలో జరుగుతోన్న  ఐపీఎల్ టోర్నీ్కి దూరమైన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్  కేఎల్ రాహుల్ ..  జాన్ లో ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహులే వెల్లడించాడు.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ తీవ్రంగా  గాయపడ్డాడు. 

బంతిని ఆపే క్రమంలో  రాహుల్ తొండ కండరాలు పట్టేశాయి. దీంతో వెంటనే  మైదానం వీడాడు. ముంబయిలో స్కానింగ్‌ చేయించుకున్న తర్వాత శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు  సూచించారు. దీంతో  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉండనని రాహుల్ తెలిపాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌, సూర్యకుమార్ యాదవ్ , మయాంక్ అగర్వాల్‌లలో ఒకరిని తీసుకోవాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. 

కాగా  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు  జూన్ 7 నుండి 11 వరకు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే ఆసీస్ క్రికెట్ బోర్టు,  బీసీసీఐ  జట్లును ప్రకటించాయి.  

భారత జట్టు ఇదే : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ, రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌