సెంచరీతో చెలరేగిన రాహుల్.. ఇంగ్లాండ్ కు భారీ టార్గెట్

సెంచరీతో చెలరేగిన రాహుల్.. ఇంగ్లాండ్ కు భారీ టార్గెట్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న సెకండ్ వన్డేలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ చెలరేగారు. రాహుల్ 114 బంతుల్లో 108 ..రిషబ్ పంత్ 40 బంతుల్లో 77 పరుగులతో కదం తొక్కడంతో ఇంగ్లాండ్ కు 337 పరగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఒపెనర్లు రోహిత్ శర్మ 25 ధావన్ 4, విరాట్ కోహ్లీ 66, కృనాల్ పాండ్యా12(నాటౌట్) పరుగులు చేశారు. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా సిక్సులతో హోరెత్తించాడు. 4 సిక్సులు ఒక ఫోర్ తో  16 బంతుల్లో 35 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ కు 337 టార్గెట్ పెట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో  రీస్ టోప్లీ 2, టామ్ కరణ్ 2,సామ్  కరణ్ , ఆదిల్ రషీద్ లకు చెరో ఒక వికెట్ పడ్డాయి.