మళ్లీ తండ్రి కాబోతున్న కోహ్లీ

మళ్లీ తండ్రి కాబోతున్న కోహ్లీ
  • అందుకే టీమ్‌‌కు దూరం:  డివిలియర్స్‌‌ వెల్లడి
  • మిగతా మూడు టెస్టులకూ విరాట్ డౌటే!

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. అందుకే ఇంగ్లండ్‌‌‌‌తో తొలి రెండు టెస్ట్‌‌‌‌లకు దూరంగా ఉన్నాడనే విషయాన్ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌‌‌‌ ఏబీ డివిలియర్స్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియాలో ఫ్యాన్స్‌‌‌‌తో పంచుకున్నాడు. విరాట్ ఎలా ఉన్నాడని యూట్యూబ్‌‌‌‌ లైవ్‌‌‌‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఏబీ పైవిధంగా బదులిచ్చాడు.

‘ఇటీవలే విరాట్‌‌‌‌తో చాట్‌‌‌‌ చేశా. ఎలా ఉన్నావు అని అడిగా. క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వనుందనేది వాస్తవం. అందుకే కోహ్లీ ఎక్కువ టైమ్‌‌‌‌ ఫ్యామిలీకి కేటాయిస్తున్నాడు. ఈ సమయంలో కోహ్లీ సరైన నిర్ణయమే తీసుకున్నాడని భావిస్తున్నా’ అని చెప్పాడు. ప్రస్తుతం అనుష్కతో కలిసి ఫారిన్‌లో ఉన్న విరాట్ ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకూ దూరంగా ఉంటాడని తెలుస్తోంది.

టీమ్ ఎంపికకు ముందు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌‌, బీసీసీఐ పెద్దల్లో ఒకరు కోహ్లీతో మాట్లాడి ఈ విషయంపై స్పష్టత తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు గాయంతో రెండో మ్యాచ్‌కు దూరమైన కేఎల్ రాహుల్ రాజ్‌కోట్‌లో జరిగే మూడో మ్యాచ్‌కు ఫిట్‌నెస్ సాధించే చాన్సుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. పేసర్ షమీ, ఆల్‌రౌండర్ జడేజా మిగతా సిరీస్‌లో ఆడే అవకాశం కనిపించడం లేదు.