వివేక్​ వెంకటస్వామికి.. మంత్రివర్గంలో చోటు కల్పించడంపై హర్షం

వివేక్​ వెంకటస్వామికి.. మంత్రివర్గంలో చోటు కల్పించడంపై హర్షం

కొల్లాపూర్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్  వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భీమాబాయి గ్రామీణ అభివృద్ధి సేవా సంస్థ ఫౌండర్ మద్దెల రామదాసు ఆధ్వర్యంలో మాలలు ఆదివారం కొల్లాపూర్​ పట్టణంలో సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. 

పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. మాలల హక్కుల కోసం కృషి చేసిన వివేక్  వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కర్ని విష్ణు, గడవల శ్రీనివాసులు, మద్దెల వెంకట రాములు, బిజ్జ సురేందర్, మాచుపల్లి రాంచందర్, ఎం చెన్నకేశవులు. అంజి, శంకర్, కలమంద అంజి, చిన్న కురుమయ్య, భరత్ కుమార్, సందీప్, జీకే వెంకటస్వామి, ఎం సంపత్ కుమార్  పాల్గొన్నారు.

మొక్కులు చెల్లించుకున్న అభిమానులు

నవాబుపేట: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడంతో ఆయన అభిమానులు, మాల మహానాడు నాయకులు మైసమ్మ ఆలయంలో నూటొక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి పదవి రావాలని గతంలో మైస్మమ్మకు మొక్కుకున్నామని, మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో మొక్కులు చెల్లించామని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కావలి రమేశ్, బ్యాగరి చంద్రయ్య, సురేశ్, అనిల్​ తెలిపారు.