కేంద్ర హోంమంత్రితో  భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి

కేంద్ర హోంమంత్రితో  భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి రాజగోపాల్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు.  బీజేపీలో చేరిక, మునుగోడులో బహిరంగ సభ ఏర్పాటు అంశంపై ముగ్గురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి చెందిన ఇతర నేతలను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా ప్రకటించిన అనంతరం ఆయన ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ ఎమ్మెల్యే పదవిని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8న స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ అందజేయనున్నారు.