కేసీఆర్ అక్రమ ఆస్తులు జప్తు చేసి జనాలకు పంచుతాం: కోమటిరెడ్డి

కేసీఆర్ అక్రమ ఆస్తులు జప్తు చేసి జనాలకు పంచుతాం: కోమటిరెడ్డి

కల్వకుంట్ల కవిత జైలుకు పోయిందని కేసీఆర్ ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ వ్యాఖ్యలపై కోమటి రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలని, ఆయన జైలుకు పోవడం  ఖాయమని మంత్రి అన్నారు. కేసీఆర్ ఆస్తులు జప్తు చేసి జనాలకు పంచుతామని చెప్పారు. 

కాళేశ్వరం అవినీతిపై క్యాబినెట్ తీర్మానం చేసి సీబీఐ ఎంక్వైరీ కోరంతామని అవినీతిపై లెక్క తేల్చుతామని  ఆరోపించారు. లక్ష అబద్ధాలు ఆడి కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించారని కోమటి రెడ్డి విమర్శించారు. కుక్కలు, నక్కలు అని మాకు తీట్టొచ్చని కౌంటర్ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్‌ల గురించి అడిగితే.. తనను శాసనసభ నుంచి బయటకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్పు చేస్తే జైలుకు ఎందుకు పంపలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రశ్నించారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే తానే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన తేల్చి చెప్పారు.