మునుగోడు ప్రచారంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ

మునుగోడు ప్రచారంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ

ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డితో  మునుగోడు  కాంగ్రెస్ అభ్యర్థి  పాల్వాయి స్రవంతి  భేటీ అయ్యారు. ఉదయం  వెంకట్ రెడ్డి  నివాసానికి  వెళ్లిన పాల్వాయి  స్రవంతిని.. తొలుత  కలిసేందుకు వెంకట్ రెడ్డి నిరాకరించారు.  దాదాపు గంటసేపు  వెయిట్ చేసిన  ఆమె.. తిరిగి వెళ్లిపోయారు.  ఆ తర్వాత  కొద్దిసేపటికే  స్రవంతికి  వెంకట్ రెడ్డి ఫోన్ చేయడంతో  మరోసారి ఆమె  వెంకట్ రెడ్డి  నివాసానికి వచ్చారు. మునుగోడు  ప్రచారానికి  రావాలని  కోమటిరెడ్డిని కోరింది. ప్రచారానికి వస్తానని  స్రవంతికి  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.