కేటీఆర్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ

కేటీఆర్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు బహిరంగా లేఖ రాశారు. చేనేత మిత్ర స్కీమ్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ జాప్యం గురించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. చేనేత మిత్ర పథకం ద్వారా కార్మికులు పట్టు నూలు కొనుగోలు చేశారని, 2 నెలలకోసారి అందాల్సిన సబ్సిడీ 6 నెలలు అయినా అందడంలేదని లేఖలో పేర్కొన్నారు. పట్టు నూలు కేజీకి రూ.6 వేలు కావడంతో.. నూలు కొనలేక చేనేత కార్మికులు మగ్గాలు నేయడం మానేసి ఆకలి బాధలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నేతన్నలను ఆదుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

మరికొన్ని వార్తల కోసం:

సీపీ నోట టీఆర్ఎస్ స్క్రిప్ట్.. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు

కుట్ర వెనక ఉన్న అన్ని విషయాలను బయటపెడతాం