మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక బీజేపీ నేతలున్నారనే ఆరోపణలను ఖండించారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కుట్ర వెనుక ఉన్న అన్ని విషయాలను బయటపెడతామన్నారు. ఆరోపణలు ఎదుర్కోవడం బీజేపీకి కొత్త కాదని చెప్పారు. తప్పుడు కేసులు, ఆరోపణలతో కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంటికి వెళ్లారు సంజయ్. పాలమూరులో బీజేపీ నేతల ఇళ్లపై రాళ్ల దాడిపై మాట్లాడారు. ఆరోపణలతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరన్నారు సంజయ్.
మరిన్ని వార్తల కోసం: