భర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం

భర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం

షాద్ నగర్/పరిగి, వెలుగు: మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి ఆశ్లేషరెడ్డి ఆదివారం కొత్తూరు, కేశంపేట, షాద్ నగర్ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఆమె వెంట షాద్​నగర్​ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆయన సతీమణి అనురాధ, ఎంపీపీ ప్రియాంక గౌడ్, జడ్పీటీసీ తాండ్ర విశాల, కౌన్సిలర్ విశాల ఉన్నారు.

 అలాగే చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి ఆదివారం పరిగి నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్, గడి సింగాపూర్, పరిగి టౌన్ లో డోర్​టు డోర్​ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్​కార్యకర్తలు ఆమె సమక్షంలో బీజేపీలో చేరారు.