మారిషస్ మహిళకు అరుదైన శస్ర్తచికిత్స.. పాంక్రియాస్లో కణితి తొలగింపు

మారిషస్ మహిళకు అరుదైన శస్ర్తచికిత్స.. పాంక్రియాస్లో కణితి తొలగింపు
  • కొండాపూర్ ​కిమ్స్ ​డాక్టర్ల ఘనత 

మాదాపూర్​, వెలుగు : మారిషస్​కు చెందిన ఓ మహిళకు కొండాపూర్​ కిమ్స్​లో అరుదైన సర్జరీ చేశారు. పాంక్రియాస్​లో అరుదైన కణితితో బాధపడుతుండగా లాప్రోస్కోపిక్​ ద్వారా తొలగించారు. శుక్రవారం కొండాపూర్​కిమ్స్​లో కన్సల్టెంట్ స‌‌‌‌ర్జిక‌‌‌‌ల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, రోబోటిక్ స‌‌‌‌ర్జన్ డాక్టర్ సీహెచ్ న‌‌‌‌వీన్ కుమార్​వివరాలు వెల్లడించారు. మారిషస్​కు చెందిన మహిళ(55) షుగర్​ లెవల్స్​తగ్గిపోవడం, వెంటనే భోజనం చేయకపోతే కళ్లు తిరిగి పడిపోతుండడంతో చెక్​చేయించగా పాంక్రియాస్​లో కణితి ఉన్నట్లు తేలింది. 

దీంతో ఇండియాకు తీసుకువచ్చి కొండాపూర్​కిమ్స్​లో జాయిన్​చేశారు. డాక్టర్ సీహెచ్ న‌‌‌‌వీన్ కుమార్ ఆమెను పరీక్షించగా పాంక్రియాస్​లో ఇన్సులినోమా అనే కణితి ఉన్నట్లు గుర్తించారు. అనస్థీషియా టీమ్​డా.వీరభద్రరావుతో కలిసి మహిళకు లాప్రోస్కోపిక్ ​పద్ధతిలో సర్జరీ చేసి కణితి తొలగించారు.