
అనారోగ్యంతో బాధపడుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే కేటీఆర్..గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి గోపినాథ్ ను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.
ఇటీవలే బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, దాసోజు శ్రవణ్,మంత్రి శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ పలువురు నేతలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపినాథ్ ను పరామర్శించారు.
కిడ్నీత్స సంబంధ వ్యాధులు, గుండె సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు మూడు రోజుల నుంచి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఐసీయూలోనే చికి పొందుతున్నారు. ఏఐజీ వైద్యుల బృందం గోపీనాథ్కు చికిత్సను అందజేస్తున్నారు.