
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్, హికోన్, జపాన్ నగరాల మధ్య స్నేహ సంబంధాలు 6 దశాబ్దాలుగా కొనసాగడం శుభపరిణామమని భారత్ బయోటెక్ గ్రూప్ ఫైనాన్స్ ఆఫీసర్ తాడేపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నారాయణగూడలో నవ్య నాటక సమితి, హైదరాబాద్ వైజ్ మెన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జపాన్పర్యటనకు సంబంధించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ డిప్యూటీ డైరెక్టర్జి.వసుంధరతో కలిసి ఆవిష్కరించారు.
మే 29 నుంచి 10 రోజుల జపాన్ దేశంలోని నగోయా, ఉట్సునోమియా నగరాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనకు బయలుదేరి వెళ్తున్న హైదరాబాద్ నృత్య కళాకారులు మాధవీమాల, రేణి శ్రీజిత్, బీఎస్.మేఖలను సత్కరించారు. విదేశాల్లో సైతం భారతీయ శాస్త్రీయ సంగీత నృత్య రీతులకు ఆదరణ లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.