కాంగ్రెస్​లోకి కూన శ్రీశైలం గౌడ్!

కాంగ్రెస్​లోకి కూన శ్రీశైలం గౌడ్!

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ మళ్లీ కాంగ్రెస్ లో చేరనున్నారు. గురువారం ఆయన నివాసానికి కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, భూపతి రెడ్డి తదితరులు వెళ్లారు. శ్రీశైలం గౌడ్ ను కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన.. తిరిగి కాంగ్రెస్​లోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా, బీజేపీ నుంచి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించిన శ్రీశైలంగౌడ్ కు నిరాశే ఎదురైంది. దీంతో కాంగ్రెస్​లో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం.