బలంగా ఉన్న స్థానాల్లో కచ్చితంగా పోటీ చేస్తం

బలంగా ఉన్న స్థానాల్లో కచ్చితంగా పోటీ చేస్తం
  • సీపీఐ నేత కూనంనేని సాంబశివ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎంలు కచ్చితంగా పోటీ చేస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివ రావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్​ మగ్దూంభవన్​లో చాడ వెంకట్​రెడ్డి, పల్లా వెంకట్​రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. 

సేవ్​ ఆర్టీసీ పేరుతో ఈ నెల 24 నుంచి 30 వరకు అన్ని డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడిం చారు. పేదల గుడిసెలకు పట్టాలు, ఇండ్లు సహా వివిధ సమస్యలపై ఆగస్టు 7 నుంచి కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ తమకు ప్రత్యర్థి అయి నా.. దేశ ప్రయోజనాల దృ ష్ట్యా ఇండియా కూటమిలో  చేరామన్నారు.