ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి పనికి వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని బూరుకుంట్ల ప్రాంతంలో 280 మంది కూలీలు మే 9వ తేదీ మంగళవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో ఉపాధి పనులు చేస్తుండగా కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.

ఈ దాడిలో ఇనుగంటి దేవానందం, పెంట మల్లయ్యలకు తీవ్ర గాయాలు కాగా, మరో వంద మంది వరకు గాయపడ్డారు. మరో మహిళకు తేలుకాటు వేసింది. గాయాల పాలైన వారందరిని కొడిమ్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారు.