యాదాద్రిలో ప్రసాదం లేక భక్తుల ఇబ్బందులు

యాదాద్రిలో ప్రసాదం లేక భక్తుల ఇబ్బందులు

యాదాద్రి గుట్టపై ప్రసాదం కొరత ఏర్పడింది. గత కొద్దిరోజులుగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెగింది. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, లడ్డూ ప్రసాద కౌంటర్లు భక్తులతో కిక్కిరిశాయి. కౌంటర్ లో ప్రసాదం లేకపోవడంతో భక్తులకు ఆలయ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. 

అయితే కొన్ని రోజులుగా ప్రసాదాల తయారీ కేంద్రంలో లడ్డూ తయారీ యంత్రం మొరాయిస్తోంది. దానికి మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో పాతగుట్ట ఆలయ గోదాం దగ్గర తయారీ కేంద్రం నుంచి మ్యాన్ పవర్ తో తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని యాదాద్రి గుట్టపైకి చేరవేస్తున్నారు. ఈ క్రమంలో ప్రసాదం సకాలంలో అందకపోవడంతో కౌంటర్ల దగ్గర భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.