రేపటితో ముగియనున్న లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు

రేపటితో ముగియనున్న లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2024 మార్చి 20 బుధవారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 వ రోజు కావడంతో మహపూర్ణాహుతి, చక్రతీర్థాన్ని( చక్ర స్నానం) ఆలయ అధికారులు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారికి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఆలయ మహా ఉద్ఘాటన తర్వాత రెండోసారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. రేపటితో(మార్చి 21) ఈ వేడుకలు కొనసాగనున్నాయి. దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి క్యూ కట్టారు. స్వామివారిని దర్శించుకొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు.

రాష్ట్రంలో మరో తిరుమల క్షేత్రంగా కొలువై విరాజిల్లుతున్న యాదాద్రీశుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేస్తుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను రెండోసారి  వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.

ALSO READ :- భారీగా ఎక్స్ పైరీ ఫుడ్ .. 22 రకాల ఐటమ్స్ స్వాధీనం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహవాచనంతో శాస్త్రోక్తంగా 11 న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ... ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో  ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు... రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన  వేదపండితుల ద్వారా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు.  బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.