దండకారణ్యంలో పేలిన మందుపాతర

దండకారణ్యంలో పేలిన మందుపాతర

భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో ఆదివారం జరిగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు బీజాపూర్​జిల్లా డుమ్రీపాల్​-టైనార్ గ్రామ అటవీ మార్గంలో మందుపాతరలను అమర్చారు.

భద్రతా బలగాలు వాటిని గుర్తించేలోపే ఒకటి పేలడంతో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు నెల్సనార్ పీహెచ్ సీలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం, హెలికాప్టర్ లో రాయ్​పూర్ హాస్పిటల్ కు తరలించారు. మిగిలిన మందుపాతరలను బాంబ్​స్క్వాడ్ నిర్వీర్యం చేసింది.