భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో ఆదివారం జరిగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు బీజాపూర్జిల్లా డుమ్రీపాల్-టైనార్ గ్రామ అటవీ మార్గంలో మందుపాతరలను అమర్చారు.
భద్రతా బలగాలు వాటిని గుర్తించేలోపే ఒకటి పేలడంతో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు నెల్సనార్ పీహెచ్ సీలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం, హెలికాప్టర్ లో రాయ్పూర్ హాస్పిటల్ కు తరలించారు. మిగిలిన మందుపాతరలను బాంబ్స్క్వాడ్ నిర్వీర్యం చేసింది.