కరెంట్ ఇవ్వాలని..రజక, క్షౌర వృత్తిదారుల ధర్నా

కరెంట్ ఇవ్వాలని..రజక, క్షౌర వృత్తిదారుల ధర్నా

ముషీరాబాద్, వెలుగు: లాండ్రీ, హెయిర్​ కటింగ్​ సెలూన్లకు ఉచిత విద్యుత్ పథకం కింద పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించి ఫ్రీగా కరెంటు ఇవ్వాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, క్షౌర వృత్తి దారుల సంఘం డిమాండ్ చేశాయి. సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్​లో మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణ వృత్తి సంఘం ముఖ్య నాయకుడు చెన్నారం మల్లేశ్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రజకులు, నాయీబ్రాహ్మణులకు రూ.230 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి ఉందని, దీంతో విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు చెల్లించాలని వృత్తిదారులపై ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు.