ENG vs IND 2025: బంగ్లా, పాక్ కన్నా ఘోరం: చివరి 9 టెస్టుల్లో టీమిండియాకు ఒకటే విజయం

ENG vs IND 2025: బంగ్లా, పాక్ కన్నా ఘోరం: చివరి 9 టెస్టుల్లో టీమిండియాకు ఒకటే విజయం

టెస్ట్ క్రికెట్ లో టీమిండియా చాలా బలమైన జట్టు. గత కొన్నేళ్లుగా స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ విజయాలను అలవాటు చేసుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాపై వారి గడ్డపై రెండు సిరీస్ విజయాలు సాధించింది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలో సిరీస్ గెలవకపోయినా గట్టి పోటీ నిచ్చింది. ఇక స్వదేశంలో భారత క్రికెట్ జట్టును ఓడించాలంటే శక్తికి మించిన పని. దీంతో కొన్ని సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ను శాసించింది. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చూపించి 2021, 2023 టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు అర్హత సాధించింది. 

ALSO READ | ICC Rankings: పంత్‌కు 800 రేటింగ్ పాయింట్లు.. తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా సరికొత్త చరిత్ర

టీమిండియాతో టెస్ట్ మ్యాచ్ అంటే ఇతర జట్లు బయపడేటట్టు చేసింది. అయితే సంవత్సర కాలంగా పూర్తిగా సీన్ రివర్స్ అయింది. విజయాలు సాధించడంలో వెనకబడుతుంది. స్వదేశంలో న్యూజిలాండ్ పై 0-3 తో వైట్ వాష్ కావడంతో టీమిండియా పతనం ప్రారంభమైంది. ఈ సిరీస్ ఓటమితో టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 1-3 తేడాతో కోల్పోయింది. తాజాగా లీడ్స్ వేదికగా మంగళవారం (జూన్ 24) ముగిసిన టెస్టులో గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. 

భారత్ తామాడిన చివరి 9 టెస్ట్ మ్యాచ్ ల్లో కేవలం ఒక టెస్టులోనే గెలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా పెర్త్ టెస్టులో ఈ విజయం వచ్చింది. ఒక మ్యాచ్ డ్రా కాగా.. 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. చివరి 9 టెస్టుల్లో టీమిండియాదే చెత్త రికార్డ్. బంగ్లాదేశ్, వెస్టిండీస్ తమ చివరి 9 మ్యాచ్ ల్లో రెండు టెస్టులు గెలిస్తే.. పాకిస్థాన్, శ్రీలంక 3 విజయాలు సాధించాయి. అత్యధికంగా సౌతాఫ్రికా తామాడిన చివరి 9 మ్యాచ్ ల్లో 8 విజయాలతో టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా 6, ఇంగ్లాండ్ 5, న్యూజిలాండ్ 4 విజయాలు సాధించాయి. భారత్ రానున్న సిరీస్ లలో సీరియస్ గా ఆడకపోతే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పై మరోసారి ఆశలు వదులుకోవాల్సిందే.