- స్వప్న హత్యకు నిరసనగా ఆందోళనలు
- ప్రొటెక్షన్ యాక్ట్ కోసం డిమాండ్
హైదరాబాద్సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో జరిగిన న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ నగర వ్యాప్తంగా అడ్వొకేట్స్ రోడ్డెక్కారు. నాంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మేడిపల్లి తదితర కోర్టుల్లో విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. హైకోర్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.వెంటనే అడ్వొకేట్ప్రొటెక్షన్యాక్ట్ తేవాలని డిమాండ్చేశారు.
డీజీపీకి వినతిపత్రం
జూబ్లీహిల్స్ : న్యాయవాది స్వప్న హత్య కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వొకేట్వై. కొండల్ రెడ్డి డీజీపీ శివధర్ రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. న్యాయవాదులు సంజీవరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాయిని రవీందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, వినీత్ రెడ్డి, మల్లిక
పాల్గొన్నారు.
