యోధుల త్యాగాలు భావితరాలకు .. తెలియకుండా కుట్ర : లక్ష్మణ్

యోధుల త్యాగాలు భావితరాలకు .. తెలియకుండా కుట్ర : లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోరాట యోధుల త్యాగాలు, వారి చరిత్రను భావితరాలకు తెలియజేయకుండా బీఆర్ఎస్ సర్కార్ కుట్ర పన్నిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. వారి చరిత్రను పాఠ్యంశాల్లో చేర్చకుండా కేసీఆర్ సర్కార్.. నిజాం పాలనకు వంతపాడుతోందని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీ లక్ష్మణ్ చీఫ్ గెస్ట్​గా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాలు రాజకీయ చైతన్యం పొందాలన్నారు. 

రాజ్యాధికారంలో మనకు సరైన వాటా దక్కినప్పుడే చాకలి ఐలమ్మకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలో ఉండి బీసీలను ఏ విధంగా మోసం చేశాయో.. రాబోయే ఎన్నికల్లో ఇవే ప్రధాన ప్రచార అస్త్రాలుగా ప్రజలకు వివరిస్తామన్నారు. ఇదే సమయంలో దేశంలో ఓబీసీలకు మోదీ చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికీ వివరిస్తామన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద కుల వృత్తులకు ఆధునిక పరికరాలు అందిస్తూ.. మోదీ కుల వృత్తులను ఏ విధంగా కాపాడుతున్నారో ప్రజలకు తెలియజేస్తామని లక్ష్మణ్​వెల్లడించారు.