చాక్లెట్లతో ఎన్నికల ప్రచారం.. వినూత్న ప్రచారానికి నేతల క్యూ

చాక్లెట్లతో ఎన్నికల ప్రచారం.. వినూత్న ప్రచారానికి నేతల క్యూ

తిరువనంతపురం: ఎన్నికల ప్రచారంలో నేతలు వినూత్న పోకడలను అనుసరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు తినే చాక్లెట్లను కూడా ప్రచారానికి ఎంచుకున్నారు. కేరళలోని కోజికోడ్ సిటీ ఈ కొత్త తరహా ప్రచారానికి వేదిక అయింది. ఆషిక అనే చాక్లెట్లు తయారు చేసే మహిళ ఈ ప్రచారానికి నాంది పలికింది.

కేరళ వడకర పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పిరంబిల్ మొట్టమొదట చాక్లెట్లను ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అక్కడ ఇది పెద్ద సక్సెస్ అయింది. దీంతో అస్సాం, తెలంగాణ, మహారాష్ట్ర తో సహా దేశం నలుమూలలకు చెందిన నేతలు ఈ చాక్లెట్లకు ఆర్డర్ ఇస్తున్నారట. తెలంగాణ నాయకులు కూడా ఒక్కొక్కరూ 1000 చాక్లెట్లు కావాలని ఆర్డర్ చేసినట్టు ఆషిక తెలిపింది.