ఆయన చిత్రాలు అనుబంధాలను గుర్తుచేస్తాయి. ఆలోచింపచేస్తాయి. మధ్యతరగతి కుటుంబాల జీవన విధానాన్ని కళ్లకు కడతాయి. నాటి తరం మొదలుకొని నేటి తరాల మధ్య ఉండే అంతరాలను తెలియజేస్తాయి. మనషుల జీవన విధానం, కల్చర్, ఆచారాలు, కళలు, సినిమాలు, సాహిత్యం ఏ జానర్ అయినా.. తనదైన స్టయిల్లో చిత్రాలు గీస్తాడు. అందుకే ఆయన లెజెండ్ ఆర్టిస్ట్. 1925లో పుట్టిన కేఎం వాసుదేవన్ నంబూద్రి పెయింటర్, స్కల్ప్చర్, లైన్ ఆర్టిస్ట్, ఆర్డ్ డైరెక్టర్. కేరళలోని సుకపురం టెంపుల్ ఆయన్ను ఆర్టిస్టుగా మార్చేసింది. ఆ టెంపుల్పై శిల్పాలు, బొమ్మలు చిత్రకళ వైపు మళ్లించాయి. మద్రాస్ స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన ఆయన ‘లైన్ స్కెచ్’ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ‘రేఖాచిత్రంగల్’ స్కెచెస్కు గాను ఆయనకు 2003లో రాజా రవి వర్మ అవార్డు వచ్చింది. కొన్ని సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. తన బొమ్మలతో మలయాళం, సాహిత్య పుస్తకాలకు రూపం ఇచ్చాడు. చక్కని కార్టూన్ బొమ్మలు గీసి సాహిత్యాన్ని మరింత దగ్గర చేశాడు. చిత్రకళే జీవితంగా బతుకుతున్న ఆయన ఇంటికివెళ్తే.. తెల్లని గడ్డం, కళ్లజోడు ధరించి, కాన్వాస్పై బొమ్మలు గీస్తూ ఒక కామన్మెన్లా కనిపిస్తాడు.

