చిరుత పులి సంచారం..కర్నూలు జిల్లాలో కలకలం

చిరుత పులి సంచారం..కర్నూలు జిల్లాలో కలకలం

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గుండుతాండా గ్రామ సమీపంలో.. చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి కుక్క పై  చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, హోసూరు చుట్టుపక్కల శివార్లలో తనిఖీలు చేశారు. చిరుత సంచరించిన ప్రదేశాల్లో రాత్రి సమయంలో గస్తీ నిర్వహించారు. పులి ఆనవాల్లను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తాయన్న.