వ్యవసాయ చట్టాల ఫలితం ఎలా ఉంటుందో కొంత కాలం చూడండి

వ్యవసాయ చట్టాల ఫలితం ఎలా ఉంటుందో కొంత కాలం చూడండి
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల అమలు ఫలితం ఎలా  ఉంటుందో ఒక కొంత కాలం చూడాలని రైతులను కోరారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. అప్పటికీ రైతులకు ప్రయేజనం లేదని గుర్తిస్తే వాటిని సవరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు  చేసిన ర్యాలీలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. రైతులకు ఉపయోగం లేని ఎటువంటి నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకోదన్నారు. నిరసనల్లో పాల్గొన్న వారు రైతు కుటుంబాలకు చెందిన వారని..వారిపై తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. సమస్యలన్నింటీనీ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు రాజ్ నాథ్ సింగ్. ప్రభుత్వంతో చర్చలకు రైతులు ముందుకు రావాలని కోరారు.