ఆఫీస్​లో కాస్త పడుకోనివ్వండి! : జీనియస్ సర్వే

ఆఫీస్​లో కాస్త పడుకోనివ్వండి!  : జీనియస్ సర్వే
  • పని సామర్ధ్యం, ప్రొడక్టివిటీ పెరుగుతుందన్న మెజార్టీ ఉద్యోగులు : జీనియస్ సర్వే

న్యూఢిల్లీ : ఆఫీస్‌‌‌‌ టైమ్‌‌‌‌లో కొంత సేపు నిద్రపోవడానికి  అవకాశమిస్తే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందని మెజార్టీ ఉద్యోగులు భావిస్తున్నారు. ఇలాంటి సంప్రదాయం జపాన్‌‌‌‌లో కామన్‌‌‌‌. పని బాగా చేయడానికి, అలసట నుంచి బయటపడేందుకు ఆఫీస్‌‌‌‌ అవర్స్‌‌‌‌లో  కొద్ది సేపు నిద్రపోవడం ముఖ్యమని జీనియస్ కన్సల్టెంట్‌‌‌‌ సర్వేలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఆఫీస్‌‌‌‌ టైమ్‌‌‌‌లో న్యాప్‌‌‌‌ (కునుకు తీయడం) బ్రేక్  ఇవ్వడం ముఖ్యమని 94 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. 

3 శాతం మంది మాత్రం ఇలాంటి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఓటేశారు.  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చేసిన ఈ సర్వేలో మొత్తం 1,207 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25– అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 27 మధ్య ఈ సర్వే చేశామని జీనియస్ వెల్లడించింది. బ్యాంకింగ్‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌, కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, ఇంజినీరింగ్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్‌‌‌‌ఆర్ సొల్యూషన్స్‌‌‌‌, ఐటీ, ఐటీఈఎస్‌‌‌‌, బీపీఓ, లాజిస్టిక్స్‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌, మీడియా, ఆయిల్‌‌‌‌ అండ్‌‌‌‌ గ్యాస్‌‌‌‌, ఫార్మా  కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను  సేకరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం,   ఆఫీస్‌‌‌‌ అవర్స్‌‌‌‌లో కొంత సేపు నిద్రపోతే పని సామర్ధ్యం మెరుగవుతుందని 82 శాతం మంది  రెస్పాండెంట్లు చెప్పగా, 12 శాతం మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు.

రోజువారి పనిలో అలసట, ఆయాసం వంటివి ఎదుర్కొంటున్నామని 60 శాతం మంది చెప్పారు. మరో 27 శాతం మంది మాత్రం తమకు అలసట లేదని పేర్కొన్నారు. ఒక గంట పాటు పడుకోవడానికి టైమ్ ఇస్తే అదనపు అవర్స్‌‌‌‌లో పనిచేసేందుకు తమకు ఓకే అని 49 శాతం మంది వెల్లడించారు. కానీ, 36 శాతం మంది మాత్రం ఈ ఆలోచన బాగోలేదని చెప్పారు.  78 శాతం రెస్పాండెంట్లు జపాన్‌‌‌‌ పాటించే ‘ఇనెమురి (ఆఫీస్ అవర్స్‌‌‌‌లో పడుకోవడం) ’ విధానం మంచిదని, ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు. ఆఫీస్ అయిపోయాక పడుకోవడానికి వీలు కలిపిస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుందని 64 శాతం మంది చెప్పగా, దీని వలన ఎటువంటి ఉపయోగం లేదని 21 శాతం మంది అన్నారు.