దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీనికి తోడు కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ క్రమంలో దేశంలోని 8 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పలు సూచనలు చేశారు. ఢిల్లీ, హర్యానా,తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు లేఖలు కూడా రాశారు. ఈ ఎనిమిది రాష్ట్రాలలో కరోనా పరీక్షలను వేగవంతం చేయాలన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతగా వేగవంతం చేయాలన్నారు. కోవిడ్ మరణాలు పెరగకుండా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించినట్టుగా తెలిపారు. ఢిల్లీలోని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మోడల్ను దేశవ్యాప్తంగా తీసుకెళ్లే ఆలోచనను కూడా పరిశీలిస్తున్నట్టుగా ఉన్నత వర్గాలు తెలిపాయి.కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి.
మరిన్ని వార్తల కోసం..