నల్లబెల్లి, వెలుగు : బీపీఎం నిర్వాకం వల్ల వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్లో రోజుల తరబడి ఉత్తరాలు డెలివరీ కాలేదు. గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం గ్రామస్తులు ఓ పోస్టు బ్యాగ్ను గుర్తించారు. స్థానికులు బస్తాను తెరవగా జాబ్లకు సంబంధించిన హాల్టిక్కెట్లు, ఆధార్కార్డులు, ఉత్తరాలు కనిపించాయి.
బీపీఎం సతీశ్ లెటర్లను రోజుల తరబడి పంపిణీ చేయకపోవడం, నిర్లక్ష్యంగా పోస్టు బ్యాగ్ను సంచిని వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీఎం పనితీరుపై ఆఫీసర్లకు కంప్లైంట్ చేశారు. పోస్టల్ ఇన్స్పెక్టర్ రమేశ్ గుండ్లపహాడ్కు వచ్చి విచారించారు.