హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష

హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష

అబిడ్స్, వెలుగు: హత్య కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని నాలుగో అదనపు సెషన్స్​కోర్టు తీర్పు వెల్లడించిందని బండ్లగూడ సీఐ దేవేందర్​ తెలిపారు. 2023 జనవరి 18న రాత్రి ముంతాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విద్యుత్ కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేశారు. 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్​మార్చురీకి తరలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కూలీ వేముల రాజును నిందితుడిగా తేల్చి, కోర్టులో ఛార్జిషీట్ వేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి సోమవారం శిక్ష ఖరారు చేశారు.