న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ టైమ్లో వలస కూలీలను ఇంటికి చేర్చడంలో ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ విశేష కృషి చేశాడు. లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా సాయం కోరిన వారిని సోనూ ఆదుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో సోనూకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా కోల్కతాలో దుర్గ పూజ పండల్ సంబురాల్లో భాగంగా సోనూ సూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. కోల్కతాలోని కేష్తోపూర్, ప్రఫుల్లా కనన్లో సోనూ స్టాచ్యూను ఏర్పాటు చేశారు. బస్సు పక్కన వలస కూలీలతో సోనూ సూద్ మాట్లాడుతున్నట్లుగా ఈ విగ్రహాలను రూపొందించారు. దీనిపై సోనూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన అవార్డుల్లో ఇదే అతి పెద్దదని సోనూ ట్వీట్ చేశాడు.
My biggest award ever ? https://t.co/4hOUeVh2wN
— sonu sood (@SonuSood) October 21, 2020