జూలై 21న 'లైగర్' ట్రైలర్

జూలై 21న 'లైగర్' ట్రైలర్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ''లైగర్'' (సాలా క్రాస్ బ్రీడ్). పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

జూలై 21న థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. మాస్ సినిమా కాబట్టి మాస్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ మరియు ముంబైలలో నిర్వహించనున్నట్లు తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో జూన్ 21న ఉదయం 9.30 గంటలకు.. అంధేరీలోని సినీ పోలిష్ లో సాయంత్రం 7.30 గంటలకు ఈ ఈవెంట్స్ జరగనున్నట్లు తెలిపారు. మరో మూడు రోజుల్లో లైగర్ ట్రైలర్ రాబోతుందని విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో ఒ పోస్టర్ షేర్ చేశాడు. కాగా, 'లైగర్' నుండి ఇప్పటికే విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.