పఠాన్ చెరు దుర్గవైన్స్ లో 12లక్షల విలువైన మద్యం చోరీ

పఠాన్ చెరు దుర్గవైన్స్ లో 12లక్షల విలువైన మద్యం చోరీ

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని దుర్గవైన్స్ లో చోరీ జరిగింది. సుమారు 12లక్షల రూపాయల ఖరీదైన లిక్కర్ ను వాహనంలో లోడ్ చేసి తీసుకెళ్లారు దుండగులు.

పటాన్ చెరు ముంబై జాతీయ రహదారి పై నవోపాన్ X రోడ్ దగ్గర ఉన్న దుర్గ వైన్స్ లో  రాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి  గుర్తు తెలియని కొందరు దుండగులు వైన్స్ లో చొరబడి  సుమారు 12 లక్షల ఖరీదైన మద్యం బాటిళ్లను దొచుకుపోయారు. ఇవాళ ఉదయం షాపు ఓపెన్ చేసేందుకు వెళ్లగా..దొంగతనం జరిగినట్లు కన్పించింది. చోరీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. కేసు నమోదు చేసిన పఠాన్ చెరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.