హైదరాబాద్, వెలుగు: అక్షయ తృతీయ సందర్భంగా ఇన్స్టామార్ట్, కల్యాణ్ జువెలర్స్ గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రకటించాయి. ఏప్రిల్ 10 నుంచి 16 తేదీల మధ్య ఐదు శాతం అడ్వాన్స్ చెల్లించి బంగారు నాణేలను బుక్ చేసుకోవచ్చు.
అక్షయ తృతీయ రోజున మార్కెట్ ధర లేదా బుక్ చేసిన ధరలో ఏది తక్కువ ఉంటే ఆ ధరకే బంగారం లభిస్తుందని కల్యాణ్ జువెలర్స్ తెలిపింది.

