లోక్ సభ ఎన్నికలు : స్పెషల్ ట్రైన్స్

లోక్ సభ ఎన్నికలు : స్పెషల్ ట్రైన్స్

లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది రైల్వే. ఏపీలో ఈ నెల 11న అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలు జరగనుండటంతో.. మంగళవారం, బుధవారం 48 ప్రత్యేక రైళ్లను నడపనుంది. విజయవాడ, గుంటూరు, వైజాగ్ కి 39, గుంతకల్‌, కర్నూలు‌, తిరుపతికి 9 ప్రత్యేక రైళ్లను రైల్వే ప్రకటించింది. ఇవి కాక, వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇవి రెండు నెలలపాటు సేవలు అందించనున్నాయి. సాధారణంగా ఏపీకి రోజుకు సగటున 40 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్టణం, భువనేశ్వర్, నర్సాపూర్, నాందేడ్ వంటి ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.