ప్రేమజంటపై దాడి..యువతి మృతి

ప్రేమజంటపై దాడి..యువతి మృతి

ఏలూరు: ప్రేమజంటపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధరామాల పర్యాటక కేంద్రంలో ఈ దారుణం జరిగింది. టూర్ కు వచ్చిన ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.  యువకుడిని ఏలూరు ప్రభుత్వ హస్పిటల్ కి తరలించారు. బాధితులు భీమడోలు మండలం అజ్జవారిగూడెం వాసులని పోలీసులు తెలిపారు. యువతిపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారించారు పోలీసులు. బౌద్ధరామాలు ఉన్న చోటు అటవీప్రాంతం కావడంతో అక్కడ జనసంచారం తక్కువగా ఉండటంతో ఈదాడి జరిగి ఉండవచ్చని చెప్పారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.