శ్రీశైలం మలన్న భక్తులు అలెర్ట్.. దేవాలయాన్ని మూసేశారు.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే..

శ్రీశైలం మలన్న భక్తులు అలెర్ట్.. దేవాలయాన్ని మూసేశారు.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే..

చంద్రగ్రహణం ప్రభావం ప్రారంభమైంది.  నంద్యాల జిల్లాశ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు. ఈ రోజు ( మార్చి 3) తెల్లవారుజామున 3 గంటలకు  సుప్రభాతసేవ,ప్రాత:కాల పూజలు, మహామంగళహారతులు, తదితర కార్యక్రమాలను అర్చకులు పూర్తిచేశారు. 

తెల్లవారుజామున 4:30 నుండి 5:30 వరకు భక్తులను శ్రీస్వామి అమ్మవారి అలంకార దర్శనానికి అనుమతించారు.  ఉదయం 6 గంటలకు శ్రీస్వామి అమ్మవారి ఉభయ,పరివార ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేశారని  ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.  మరల  తిరిగి సాయంత్రం 7:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి,సంప్రోక్షణ .. అభిషేకం , తదితర  కార్యక్రమాలను నిర్వహించి  రాత్రి 9 గంటల నుండి 10:30 వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తారు.  

చంద్రగ్రహణం కారణంగా ..  ఈరోజు ( మార్చి 3)  ఆర్జిత,శాశ్వత,పరోక్షసేవలు శ్రీస్వామి అమ్మవారి కల్యాణోత్సవ కార్యక్రమాలను ఆపేశారు. అలాగే  అన్నప్రసాద వితరణ నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ  ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు.