గ్రహణం ఎఫెక్ట్ :  తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ స్వామి దర్శనం ఎన్నిగంటలకంటే ..!

గ్రహణం ఎఫెక్ట్ :  తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ స్వామి దర్శనం ఎన్నిగంటలకంటే ..!

 చంద్రగ్రహణ ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలను మూసివేస్తున్నారు.  ఇప్పటికే ( వార్త రాసే సమయానికి) శ్రీశైలం ఆలయం మూసి వేయగా.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆలయం మూసి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ రోజు ( మార్చి 3) మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం ...  సాయంత్రం 6:47 గంటల వరకు ఉంటుంది. 

వేద సంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయ తలుపులు మూసివేస్తారు..
రాత్రి 7:30 గంటలకు తలుపులు తీసి, ఆలయ శుద్ధి,  పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.  మళ్లీ తిరిగి తిరుమల శ్రీవారి దర్శనాలు  రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతాయని టీటీటీ అధికారులు తెలిపారు.