అపరిచితుడిలా ప్రవర్తిస్తూ.. ‘మా‘ పరువు తీస్తుండు

అపరిచితుడిలా ప్రవర్తిస్తూ.. ‘మా‘ పరువు తీస్తుండు

మా ఎన్నికలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ కు ఎవరైనా బిపి మాత్ర ఇస్తే బాగుంటుందని..అపరిచితుడుగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు మంచు విష్ణు. చిన్న చిన్న విషయాలకు ‘మా’ పరువు తీస్తున్నాడన్నారు.ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడతున్నారన్నారు. పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు ఏమి చేస్తాడన్నారు.

కృష్ణ, కృష్ణంరాజును  ప్రకాశ్ రాజ్ అవమానిస్తారా? అని  ప్రశ్నించారు మంచు విష్ణు. తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ గురించి ఎవరినడిగినా చెబుతారన్నారు. ‘మా’ ఇల్లును పాడు చేసేందుకు ప్రకాశ్ రాజ్ కంకణం కట్టుకున్నాడన్నారు. జీవిత  చెప్పేది కరెక్ట్ గా చెప్పాలన్నారు. నాలుగు రోజులు ముందు రాజశేఖర్ వచ్చి మోహన్ బాబుతో ఏమి చెప్పారో జీవితకు తెలియదన్నారు. తన గురించి మాట్లాడండి..  కానీ తన ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు.  తన ఫాదర్ పేరును ప్రస్తావించొద్దన్నారు మంచు విష్ణు .