మహారాష్ట్ర సీఎల్పీ పదవికి బాలాసాహెబ్ రిజైన్

మహారాష్ట్ర సీఎల్పీ పదవికి బాలాసాహెబ్ రిజైన్

ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ పార్టీ శాసన సభాపక్ష నేత(సీఎల్పీ) పదవికి  మంగళవారం రాజీనామా చేశా రు. అహ్మద్‌‌నగర్ జిల్లా సంగమ్‌‌నేర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న థోరట్.. తన రాజీనా మాను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేతో కలిసి పనిచేయ లేనని థోరట్ తన రిజైన్ లెటర్ లో వెల్లడించినట్లు చెప్పాయి. దీనిపై నానా పటోలే స్పందించారు. “నాకు థోరట్ రాజీనామా లెటర్ అందలేదు. ఆయన కొన్ని రోజులుగా మాతో మాట్లాడటం లేదు. నాకు థోరట్ లేఖ అందితే దానిపై స్పందిస్తాను” అని నానా పటోలే అన్నారు.