- వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట ప్రసాదాలకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దేవాదాయ శాఖ ఆన్ లైన్లో ప్రసాదాన్ని విక్రయించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేనుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం, కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రసాదాలను కావాలనుకునే వారు ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు. మీసేవలో రూ.225 చెల్లిస్తే వారి ఇంటికే దేవాదాయ శాఖ ప్రసాదాలను పంపిణీ చేస్తుంది. ఆదివారం ఈ మేరకు దేవాదాయ శాఖ పత్రికా ప్రకటనను వెలువరించిది. మహాశివ రాత్రి వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.