స్కాలర్ షిప్‍ దరఖాస్తుకు నేడు ఆఖరు

స్కాలర్ షిప్‍ దరఖాస్తుకు నేడు ఆఖరు

వికారాబాద్‍, వెలుగు: ఫారిన్ లో చదువుకోవాలనుకునే బీసీ విద్యార్థులు 2018–19 సంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిరావుఫూలే ఓవర్సీస్‍ విద్యా నిధి నుంచి స్కాలర్ షిప్‍ పొందేందుకు నేడే ఆఖరని బీసీ సంక్షేమ శాఖ వికారాబాద్‍ జిల్లా అధికారి పుష్పలత తెలిపారు. రాష్ ట్ర ప్రభుత్వం ద్వారా అందే రూ.20 లక్షలు పొందాలంటే 15 వ తేదీ సాయంత్రం 4గంటల లోపు దరఖాస్తు చేసుకొని ఉండాలని గురువారం ఓ ప్రకటనలో చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోచ్చని సూచిం చారు.

డిగ్రీతో పాటు 60 శాతం మార్కు లు ఉన్నవారే అర్హులని తెలిపారు. అభ్యర్థి వయస్సు 35 సంవత్సరా లలోపు ఉండాలన్నారు. వార్షిక ఆదాయం రూ.5లక్షలకు మించరాదన్నారు. అలాగే ఫారిన్‍ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్‍ లెటర్‍ పొంది ఉండాలన్నా రు. ఒక కుటుం బం నుం చి ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. దరఖాస్తులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వం లోని కమిటీ పరిశీలించి ఎంపిక చేస్తుందన్నా రు.