బిల్ గేట్స్ తో మహేశ్ దంపతులు

బిల్ గేట్స్ తో మహేశ్ దంపతులు

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు దంపతులు టెక్ దిగ్గజాల్లో ఒకరైన బిల్ గేట్స్ ను కలిశారు. మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ పిక్ వైరల్ గా మారింది. బిల్స్ గేట్స్ ను కలవడం సంతోషంగా ఉందని, గ్రేటెస్ట్  విజినరీ ఉన్న వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు. గొప్ప దార్శనికుల్లో ఒకరని.. అత్యంత గౌరవమైన.. ప్రోత్సాహకర వ్యక్తి అంటూ అభివర్ణించారు. బిల్ గేట్స్ ఒక స్ఫూర్తి అన్నారు. మహేశ్ బాబు లెటెస్ట్ మూవీ ‘సర్కారు వారీ పాట’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భార్య నమ్రత,  పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి విదేశాలకు వెళ్లారు మహేశ్ బాబు. యూరప్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో న్యూయార్క్ వచ్చిన మహేశ్, నమ్రత దంపతులు బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. భార్య నమ్రతతో బిల్ గేట్స్ ను కలిసిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. విదేశాల్లో పర్యటన అనంతరం ఇండియాకు చేరుకున్న తర్వాత.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాను మొదలు పెట్టనున్నారు. ఇది ఆయనకు 28వ సినిమా. అనంతరం రాజమౌళి పాన్ ఇండియా మూవీ చేయనున్నారని సమాచారం.