జెట్ స్పీడుతో బుల్లెట్టు బండెక్కి..

జెట్ స్పీడుతో బుల్లెట్టు బండెక్కి..

సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌‌‌‌గా సూపర్ స్పీడ్‌‌‌‌తో దూసుకెళ్తున్నాడు మహేష్ బాబు. ఆయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ జెట్ స్పీడుతో జరుగుతోంది. దుబాయ్, గోవా షెడ్యూల్స్ తర్వాత హైదరాబాద్‌‌‌‌లో షూట్‌‌‌‌ తిరిగి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఉప్పల్ మెట్రో డిపోలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ముఖ్యంగా మహేష్  బుల్లెట్‌‌‌‌పై స్టైల్‌‌‌‌గా కూర్చున్న ఫొటో వైరల్ అయింది. షూటింగ్ గురించి తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో షూటింగ్‌‌‌‌ ఆపేశారు కూడా. ఇప్పటికే మెట్రో స్టేషన్ బ్యాక్‌‌‌‌డ్రాప్ లో మహేష్, సముద్రఖని కాంబినేషన్‌‌‌‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరో యిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ బాబుతో కలిసి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దీని తర్వాత త్రివిక్రమ్‌‌‌‌తో సినిమా చేయబోతున్నాడు మహేష్. పూజా హెగ్డే మెయిన్ లీడ్‌‌‌‌గా, నభా నటేష్ సెకెండ్‌‌‌‌ లీడ్‌‌‌‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.