కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్తికల నిమజ్జనం

కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ  అస్తికల నిమజ్జనం

సూపర్ స్టార్ కృష్ణ అస్తికలను ఆయన కొడుకు, సినీ నటుడు మహేష్ బాబు ఇయ్యాళ కృష్ణానది దుర్గా ఘాట్ లో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం మహేష్ బాబు హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో  గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మహేష్ తో పాటు గల్లా జయదేవ్, మహేష్ బాబు బాబాయ్ శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, త్రివిక్రమ్ సైతం  అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. భారీ బందోబస్తు మధ్య మహేష్ బాబు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ కృష్ణా నదికి బయలుదేరారు.

350కి పైగా చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ వారం రోజుల క్రితం తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అనంతరం అభిమానుల, ప్రముఖుల అశ్రునయనాల మధ్య కృష్ణ అంతియ యాత్ర సాగగా.. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలో కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన అస్తికల్ని కృష్ణానదితో పాటు మిగతా నదుల్లోనూ నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా ఇయ్యాళ కృష్ణానదిలో కృష్ణ అస్తికలు నిమజ్జనం చేయనున్నారు.