
సరిగ్గా మరో రెండు వారాల్లో మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసిన టీమ్ పోస్ట్ ప్రొడక్షన్పై ఫోకస్ పెట్టింది. మరోవైపు ప్రమోషన్లోనూ స్పీడు పెంచారు. ఆల్రెడీ టీజర్, పాటలతో సినిమాపై అంచనాలు పెంచారు. నిన్న ట్రైలర్ రిలీజ్ డేట్ని కూడా ప్రకటించారు. మే 2న ట్రైలర్ను విడుదల చేయనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మాస్ ఎలివేషన్స్తో యాక్షన్ ప్యాక్డ్గా ఈ ట్రైలర్ ఉండబోతోందన్నారు. మహేష్, కీర్తి సురేష్ జంటపై తీసిన ఓ మాస్ సాంగ్ను కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు చెప్పారు. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్లో చూపించబోతున్నాడట దర్శకుడు పరశురామ్. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది.