మహీంద్రా XUV 500 కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్ 

మహీంద్రా XUV 500 కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్ 

మహింద్రా అండ్ మహింద్రా ఎక్స్‌‌యూవీ500 కు చెందిన కొత్త ఎంట్రీ లెవల్  డబ్ల్యూ3 వేరియంట్‌‌ను మార్కెట్‌‌లోకి లాంచ్ చేసింది. దీని ఢిల్లీ ఎక్స్‌‌షోరూం   ధర రూ.12.22 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా కంపెనీకున్న అన్ని డీలర్‌‌‌‌షిప్‌‌ల వద్ద వెంటనే అందుబాటులోకి వస్తాయని ఎంఅండ్ఎం చెప్పింది.  డబ్ల్యూ3 వేరియంట్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌‌మిషన్‌‌తో మార్కెట్‌‌లోకి వచ్చింది. ప్రొజెక్టర్ హెడ్‌‌ల్యాంప్స్‌‌, డ్యూయల్–ఫ్రంట్‌‌ ఎయిర్‌‌‌‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఎలక్ట్రానిక్‌‌ బ్రేక్‌‌ఫోర్స్‌‌ డిస్ట్రిబ్యూషన్, నాలుగు వీల్స్‌‌కు డిస్క్ బ్రేక్స్‌‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.