
- గ్రేటర్లోని మూడు కమిషనరేట్ల క్రైమ్ రివ్యూ
- మీటింగ్లో పాల్గొన్న డీజీపీ, సీపీలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేరాలను కంట్రోల్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ పోలీస్ బాస్లను ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న నేరాలపై బుధవారం ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, డీజీపీ అంజనీకుమార్, సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్లో నేరాలను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. హత్యలు, మహిళలపై జరుగుతున్న నేరాలను కంట్రోల్ చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కాలనీలు, బస్తీలు, సున్నితమైన ప్రాంతాలు, జంక్షన్లలో సీసీటీవీ కెమెరాల వాడకం పెంచాలన్నారు. రెచ్చగొట్టే సందేశాలు, ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేసే వారిని గుర్తించాలని సూచించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. రెగ్యులర్గా క్రైమ్ రివ్యూ మీటింగ్లు నిర్వహించాలని చెప్పారు. రౌడీ షీటర్లు,హిస్టరీ షీటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.