కరోనా సమయంలో పోలీసుల సేవలు మరువలేనివి

కరోనా సమయంలో పోలీసుల సేవలు మరువలేనివి

కరోనా సమయంలో పోలీసుల సేవలు మరవలేనివన్నారు హోంమంత్రి మహమూద్  అలీ. ఎల్బీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ సభ జరిపింది సర్కార్. అమరులకు నివాళి అర్పించి.. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు హోంమంత్రి, డీజీపీ. దేశవ్యాప్తంగా 264 మంది పోలీసు అమరుల వివరాలతో కూడిన అమరులువారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డే జరుపుతామన్నారు. ఉగ్రవాదం, సంఘవిద్రోహ శక్తుల నియంత్రణలో పోలీసులు ఎంతో కష్టపడుతున్నారన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ సత్ఫలితాలిస్తోందని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. కరోనా, భారీ వర్షాలు విపత్తుల సమయంలోనూ పోలీసుల సేవలు మరువలేనివన్నారు .

లోయలో పడ్డ బస్సు..ఐదుగురు మృతి

ప్లేట్ బిర్యానీ రూ. 10 ఆఫర్.. అడ్డుకొని ఫ్రీగా పంచిపెట్టిన పోలీసులు

నేరం చేసిన వారు ఎవరైనా సరే వదలొద్దు